Home » Israel Hamas War
ఇరాన్-ఇజ్రాయెల్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు దీటుగా స్పందించింది ఇరాన్. ఏకంగా యూఏఈ సైనిక స్థావరాలుండే ఎనిమిది దేశాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరి పక్షాన నిలుస్తాయనే విషయాన్ని ఓసారి చూస్తే..
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ ఒకరు మృతిచెందారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.
ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా సహా మొత్తం ఎనిమిది దేశాలే లక్ష్యంగా మిసైల్ దాడులు నిర్వహిస్తోంది.
రెండేళ్లుగా ఉద్రిక్తతలు రేపుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తాజాగా విడుదల చేసింది.
దాదాపు రెండేళ్లుగా హమాస్ బందీలుగా ఉన్న ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరులు సోమవారం విముక్తి లభించింది. రెండేళ్లు హమాస్ చెరలో ఉన్న పౌరులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తొలుత ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదర్చి గాజా శాంతి ఒప్పందానికి నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గాజా శాంతి ప్రణాళిక మొదటి దశను స్వాగతించారు. గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి వైపు ఇది తొలి అడుగు అని మోదీ అభివర్ణించారు.
గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్లు ముందుకొచ్చాయని, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు తెలిపారు.
గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పోస్ట్ చేశారు.
హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. తాజాగా జరిగిన దాడిలో సుమారు ఆరుగురు కన్నుమూశారు.
ట్రంప్ హెచ్చరికలతో హమాస్ దిగివస్తోంది. ఇజ్రాయెల్ బందీల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ తాజా పరిణామంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గాజాలో ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని..