Home » Ganesh Chaturthi
బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈ ఏడాది మునుపెన్నడూ లేని రీతిలో వేలంపాటలో రికార్డు ధర కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఇదొక్కటే కాదు.. బాలాపూర్ గణపయ్యకు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు భక్తులు. కేవలం 11 రోజుల్లోనే ఎన్ని లక్షల ఆదాయం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు..
రాబోయే ఏడాది వినాయక్ సాగర్లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
గణేష్ చతుర్థి అంటే కేవలం భక్తి, సంతోషాల పండుగ మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఓ అద్భుతమైన ఉత్సవమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. ఈ పండుగ ద్వారా ఈ ఏడాది వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెప్పింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. స్వామి విగ్రహాలతో నిండిన భారీ వాహనాలతోనే రోడ్లు నిండిపోయాయి.
ఈ రోజు 6500 వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇది కేవలం గణపతి మండపాల్లో ఉంచిన వినాయక విగ్రహాల సంఖ్య మాత్రమే. ఈ పెద్ద విగ్రహాలతో పాటు 1.5 లక్షల ఇంటి గణపతుల నిమజ్జనం కూడా ఈ రోజే జరగనుంది.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
హైదరాబాద్ రాజేంద్రనగర్లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట బాలాపూర్ గణేష్ లడ్డూ చరిత్రను తిరగరాసింది. అంటే వేలం ధర లక్షలకే కాకుండా ఏకంగా కోట్ల రూపాయలకు పెరిగింది.
మహా నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ గణేశ్ విగ్రహం మొదలుకొని హుస్సేన్సాగర్ వరకు గల ప్రధాన శోభాయాత్ర మార్గం (19 కిమీ)లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.