• Home » Aranii Srenevasulu

Aranii Srenevasulu

MLA: భూమనా.. శవ రాజకీయాలు మానుకో

MLA: భూమనా.. శవ రాజకీయాలు మానుకో

వైకుంఠ ద్వార దర్శన టికెట్స్‌ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) అన్నారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్‌ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం పరామర్శించారు.

AP Elections: కూటమి అభ్యర్థికి మద్దతుగా జేపీ, లోకేష్ రోడ్‌ షో

AP Elections: కూటమి అభ్యర్థికి మద్దతుగా జేపీ, లోకేష్ రోడ్‌ షో

Andhrapradesh: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్‌ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్‌ తిరుపతికి వచ్చారు.

AP Elections 2024: మా ప్రచారంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆరణి శ్రీనివాసులు

AP Elections 2024: మా ప్రచారంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆరణి శ్రీనివాసులు

తాము ప్రచారం చేసే సమయంలో వైసీపీ (YSRCP) నేతలు తమకు అడ్డుతగిలి అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) అన్నారు. తమ ప్రచారం సందర్భంగా గిరిపురంలో తమపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోక పోవటం, వైసీపీ వారం రోజులుగా తమ ప్రచారంలో అరాచకాలు సృష్టించటంపై తిరుపతి ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.

AP Elections 2024: జనసేన నేత ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి

AP Elections 2024: జనసేన నేత ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి

తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.

Janasena: 3 స్థానాలపై పవన్‌ కసరత్తు.. తిరుపతి సీటుపై ఫైనల్‌గా..!

Janasena: 3 స్థానాలపై పవన్‌ కసరత్తు.. తిరుపతి సీటుపై ఫైనల్‌గా..!

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలినవి 3 స్థానాలు మాత్రమే.

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?

Andhrapradesh: జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి. జనసేనలోనూ పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Arani Srinivasulu: నేను నాన్ లోకల్ కాదు.. లోకలే

Arani Srinivasulu: నేను నాన్ లోకల్ కాదు.. లోకలే

Andhrapradesh: తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన- టీడీపీ - బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

Arani Srinivasulu: పవన్ కల్యాణ్ మాట వేదం... తిరుపతి అభ్యర్థిని నేనే..

Arani Srinivasulu: పవన్ కల్యాణ్ మాట వేదం... తిరుపతి అభ్యర్థిని నేనే..

Andhrapradesh: ‘‘పవన్ కల్యాణ్ మాట వేదం. తిరుపతి అభ్యర్థిని నేనే’’ అని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం కపిలేశ్వర ఆలయంలో ఆరణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌తో చాలా సమయం మాట్లాడానని... ప్రతి మాట ఎంతో ఆలోచింపజేశాయని.. ఆయన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తిరుపతిలో అనేక మంది బంధువులున్నారని... వ్యాపారులున్నాయన్నారు.

Arani Srinivasulu: వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి

Arani Srinivasulu: వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీని, చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బడా ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో గుట్కా ,పేకాట, లాటరీ, ఇసుక ఇలా అన్ని రకాల అక్రమ కార్యకలాపాలను పెంచి పోషించిన వ్యక్తి విజయానంద రెడ్డి అని అన్నారు.

Arani Srinivasulu: బలిజలంటే సీఎం జగన్‌కు గిట్టదు...

Arani Srinivasulu: బలిజలంటే సీఎం జగన్‌కు గిట్టదు...

Andhrapradesh: బలిజ కులస్తులంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిట్టదని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితమే వదిలినా సస్పెండ్ చేయలేదన్నారు. కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తినని తనపై చిన్నచూపని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి