మారుమూల పల్లెల్లో సైతం విద్యా భివృద్ధికి ప్రభుత్వం కృషివేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమ వారం హరిపురం ప్లస్ టూ హైస్కూల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, మాధవరావు, రుద్రయ్య, గున్నయ్య, వాసు, వైకుంఠరావు, తమిరి భాస్కరరావు, లచ్చయ్య పాల్గొన్నారు.
పట్టణంలోని పడకండ్ల సమీపంలో ఉన్న గురుకుల బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం తనిఖీ చేశారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
Long Wait for Cotton Sales మండల కేంద్రంలో సీసీఐ ద్వారా పత్తి విక్రయాలకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Develop Villages into Beautiful Habitats జిల్లాలో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి అన్నారు. గ్రామ ముస్తాబు కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ప్రైవేట్ కల్యాణ మండపంలో సర్పంచ్లు, అధికారులతో సమీక్షించారు.
Changes in ‘Upadhi’ Scheme ఉపాధి హామీ పథకం పేరు మారింది. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఈమేరకు జిల్లాలో వేతనదారుల పని దినాల సంఖ్య పెరగనుంది. దీనిపై త్వరలోనే ఆదేశాలు రానున్నాయి.
Digitization of Revenue Records రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్లతో సమీక్షించారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమమే లక్ష్యమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఖండే శ్యామ్సుందర్లాల్, చలం బాబు అన్నారు.
శ్రీశైల క్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువైన్న పురాతన శివలింగాలకు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో శ్రీనివాస రావు తెలిపారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వరకు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు.