పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
Tirupati Tragedy: ఐదవ అంతస్తు నుంచి కింద పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన తిరుపతిలో పెను విషాదాన్ని నింపింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్లో సంభాషించడం జరుగుతోంది.
Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబిఐ అధికారి రాంసింగ్తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.
Land Mafia: నెల్లూరు జిల్లాలోని వింజమూరులో ఉన్న సర్కార్ భూములపై భూమాఫియా సరికొత్త కుట్రలకు తెరదీసింది. గత యాభై ఏళ్లుగా ఈ భూములు భూ మాఫియా చేతిలో చిక్కుకున్నాయి. అయితే ఈ భూముల విలువ వందకోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.