Vemulawada: వేములవాడ బంద్ పాటించిన వ్యాపారులు
ABN , Publish Date - May 15 , 2025 | 04:25 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వేములవాడ పట్టణ బంద్ విజయవంతమైంది.

దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్
వేములవాడ, మే 14(ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వేములవాడ పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రధాన రహదారుల్లో దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేశారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రామతీర్థపు రాజు తదితరులు పాదయాత్ర చేశారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు మంజూరయ్యాయో, ఏ రకమైన డిజైన్లు ఖరారు చేశారో వెల్లడించకుండానే జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేసి భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనం కల్పించాలని నిర్ణయించడం సరికాదని ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, దర్శనాలు, ఆలయ విస్తరణకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు
వేములవాడ ఆలయ అభివృద్ధికి.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డు : ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ ఆలయాన్ని ప్రభుత్వం రూ. 76 కోట్లతో అభివృద్ధి చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు అడ్డు తగులుతున్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అభివృద్ధిని జీర్ణించుకోలేకనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేములవాడ పట్టణ బంద్కు పిలుపు ఇచ్చారని విమర్శించారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే స్వామివారికి నిత్య పూజలు యథావిధిగా నిర్వహిస్తామని, దేవాలయం మూసివేత ఉండదని స్పష్టం చేశారు. ‘‘భక్తులకు ఆర్జిత సేవలను దూరం చేయకుండా శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేశాం... దానికి రాజన్నకు చేసే పూజలు భీమన్నకు ఎలా చేస్తారని వితండవాదం చేస్తే ఎట్లా? రాజన్న ఆలయంలోను, బీమన్న ఆలయంలోనూ ఉన్నది పరమశివుడే కదా?’’ అంటూ నిలదీశారు. అసలు మహా మండపాన్ని ముట్టుకుంటామని, దేవాలయాలను మారుస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు చర్చలకు వస్తే వారి సూచనలు, సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈమేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News