Share News

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:16 PM

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Union Railway Minister Ashwini Vaishnav

హనుమకొండ, జులై 19: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పనుల పరిశీలన నిమిత్తం ఇవాళ కేంద్రమంత్రి యూనిట్ ను సందర్శించారు. తెలంగాణలో ఇదో పెద్ద ప్రాజెక్టు అని చెప్పిన కేంద్రమంత్రి.. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దేశంలోనే ఇది.. పెద్ద రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని.. వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. 2026 నాటికి కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని.. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని కేంద్రమంత్రి చెప్పారు. త్వరలోనే కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయావుతాయని రైల్వే మంత్రి చెప్పారు.


కాజీపేట మానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణ ప్రజల చాలా ఏళ్ల కల అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చాం. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. వాళ్ల సిఫార్సు మేరకు ఉద్యోగాలు కల్పిస్తాం. మోదీ చేస్తున్న అభివృద్ధి.. కళ్లున్న వాళ్లు చూడాలి, చెవులన్న వాళ్లు వినాలి. లేదంటే ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకోండి. మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా ఎయిర్ పోర్ట్ లో విమానాలు ఎగురుతాయి' అని కిషన్ రెడ్డి తెలంగాణ సర్కారుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 05:21 PM