పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి: డీటీఎఫ్
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:56 AM
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని డెమొక్రటిక్ టీచర్స్..

హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎ్ఫ) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటివరకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందలేదని తెలిపారు. బిల్లుల చెల్లింపునకు ప్రతి నెలా రూ.700 కోట్లు కేటాయిస్తామని చెప్పినా.. ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదన్నారు. పీఆర్సీ మాట ఎత్తడం లేదని, 33 జిల్లాల్లో 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారని, ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు అసంబద్ధంగా, అన్యాయంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ ఉత్తర్వులను సవరించి, వెంటనే సప్లిమెంటరీ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోవాలి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఎయిర్ ఇండియా విమాన ప్రమాద నేపథ్యంలో ప్రధాని మోదీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి పదవి నుంచి దిగిపోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రధాని బాధ్యతలను అమిత్ షాకు అప్పగించాలన్నారు. శనివారం ఢిల్లీలోని ఏపీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు పదవికి రాజీనామా చేయాలని, ఆయనకు విమానాయన రంగంలో అనుభవం లేదని చెప్పారు. కేంద్ర మంత్రితో వ్యక్తిగత గొడవలేమీ లేవని, దేశ ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని తప్పు చేసిన వారికి శిక్ష విధించాల్సిందేనన్నారు.