Seethakka: మంత్రి సీతక్క విశాల దృక్పథం.. మండలానికి ప్రత్యర్థి పార్టీ నాయకుడి పేరు
ABN , Publish Date - May 31 , 2025 | 09:38 PM
Seethakka Greatness: సీతక్క అభ్యర్థనను మేరకు ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్చింది.

మంత్రి సీతక్క మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. ఓ మండలానికి ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ నాయకుడి పేరు పెట్టించారు. మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్పించారు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ సేవలను గుర్తించి.. జగదీష్ పేరుతో మండలాన్ని ఏర్పాటు చేస్తామని సీతక్క గతంలో ప్రకటించారు. కుసుమ జగదీష్ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారైనా.. సీతక్క తాను ఇచ్చిన మాటను మర్చిపోలేదు.
సీతక్క అభ్యర్థనను మేరకు ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేసింది. విశాల దృక్పథంతో మంత్రి సీతక్క.. జగదీష్ పేరుతో మండలాన్ని ఏర్పాటు చేయడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు వైద్య పరీక్షలు పూర్తి
టాలీవుడ్ నటి కల్పిక గణేష్పై పబ్లో దాడి..