Share News

ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించాలి

ABN , Publish Date - Jun 13 , 2025 | 03:52 AM

ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను వీలైనంత మేర తగ్గించేలా అధికారుల ప్రణాళికలు ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు.

ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించాలి

  • జిల్లాల్లోనూ విపత్తు నిర్వహణ వ్యవస్థ బలోపేతం: పొంగులేటి

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను వీలైనంత మేర తగ్గించేలా అధికారుల ప్రణాళికలు ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. జిల్లాల్లోనూ విపత్తుల నిర్వహణ విభాగాన్ని బలోపేతం చేయడానికి హైడ్రా కమిషనర్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరెక్టర్‌, అగ్నిమాపక. నీటిపారుదల, ఆర్‌ అండ్‌ బీ, ఆరోగ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేశామని తెలిపారు.


వారం రోజుల్లో ఆ నివేదిక వస్తుందని, దాని ప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పలు జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సచివాలయంలో గురవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది వానాకాలం 15 రోజులు ముందే వచ్చిందని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jun 13 , 2025 | 03:52 AM