Konda Surekha: దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్: సురేఖ
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:56 AM
దేవుడి భూముల్ని కబ్జా చేసే వారిపై పీడీ యాక్టులు పెడతామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): దేవుడి భూముల్ని కబ్జా చేసే వారిపై పీడీ యాక్టులు పెడతామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్ల వద్ద దేవాదాయ శాఖకు చెందిన భూమి అన్యాక్రాంతమవుతోందన్న ఫిర్యాదు మేరకు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలో ఉన్న 30.28 ఎకరాల భూమి 1976 నుంచి దేవాదాయ శాఖ పరిధిలో ఉందని, దీనిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దేవాదాయ భూములు కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.