Konda Surekha: సౌకర్యాలతోనే జూపార్కులకు తాకిడి: సురేఖ
ABN , Publish Date - May 23 , 2025 | 04:55 AM
జంతు ప్రదర్శన శాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): జంతు ప్రదర్శన శాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జూపార్కులతోపాటు అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని తెలిపారు. సచివాలయంలో గురువారం జరిగిన జపాట్ (జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) 14వ గవర్నింగ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అటవీశాఖ ఆదాయం పెంచుకోవడానికి జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పకడ్బందీ ప్రణాళికతో పని చేయాలని చెప్పారు. జూ పార్కులు, మృగవాని తదితర పార్కుల్లో అదనపు సౌకర్యాలపై దృష్టి దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News