Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:48 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న 90వేల మంది భక్తులు
యాదగిరిగుట్ట, జూన్ 1(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటం, వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానాలయం, శివాలయం, కల్యాణ మండపం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలలు కిటకిటలాడాయి. సుమారు 90వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా, ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..