Yadadri Bhuvanagiri: అప్పుల బాధతోరైతు ఆత్మహత్య
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:51 AM
పంట సాగుకు చేసిన అప్పు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం

రామన్నపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పంట సాగుకు చేసిన అప్పు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన బి.రాజుయాదవ్(35) ఎకరం పొలంలో వరి సాగు చేస్తున్నాడు. రెండు దఫాలుగా పొలం ఎండిపోవడంతో రూ.2 లక్షలు అప్పు తెచ్చి బోరు వేసినా నీరుపడలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజు ఇంట్లో గడ్డిమందు తాగాడు.