అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:52 AM
రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ పత్తి విత్తనాలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి
రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న ముఠా
రూ.65లక్షల విలువ చేసే 22 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్
సూర్యాపేటక్రైం,జూన్10,(ఆంధ్రజ్యోతి): రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ పత్తి విత్తనాలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.65లక్షల విలువగల 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చే సు కున్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ వివరా లు వెల్లడించారు. ఈ నెల 9న ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపాడు స్టేజీ వద్ద సూర్యాపేట సీసీఎస్, ఆత్మకూర్(ఎస్) మండల పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన తండ నగేష్ బైక్పై గోనె సంచి పెట్టుకుని సూర్యాపేట వైపు వెళ్తున్నాడు. పోలీసులు బైక్ ఆపి సంచి తనిఖీ చేశారు.అందులో ఎలాంటి ఆధారాలు లేని 120 ప్యాకెట్ల పత్తి విత్తనాలు ఉన్నాయి. అనుమానం తో నగే్షను అదుపులోకి తీసుకుని విచారించగా వాటిని ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గంపలగూ డెంమండలం పెనుగోలు గ్రామానికిచెందిన పం ది రాములు వద్ద తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు.
అరుణోదయ పేరుతో విక్రయాలు
నిందితులందరినీ సూర్యాపేటకు తరలించి పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన మాగులూరి సాంబశివరావు అరుణోదయ అనే విత్తన కంపెనీని ఏర్పాటు చేసి గడ్డి మందుకు తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలు అని నమ్మబలుకుతూ అతడి కంపెనీ నుంచి కర్నూలుకు జిల్లా పల్లిపాడుకు చెందిన చెవుల నర్సింహులు వాహనంలో విత్తన ప్యాకెట్లను గుంటూరు శ్రీనివాసరావుకు సరఫరా చేస్తున్నాడు. వాటిని శ్రీనివాసరావు ఒక్కొక్కరికి విక్రయిస్తున్నాడు. రైతులకు విక్రరుస్తున్న సమయంలో పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిందితుల సమాచారం మేరకు నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న అరుణోదయ కంపెనీ ఎండీ సాంబశివరావుతో అదుపులోకి తీసుకున్న అందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంబశివరావుతో పాటు విత్తన ప్యాకెట్లను సరఫరా చేసే నర్సింహులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.
డొంక కదిలిందిలా..
ఈ విత్తనాలు గడ్డిమందును తట్టుకునేవని, అధిక దిగుబడులు వస్తాయని రైతులను నమ్మించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు నగేష్ అంగీకరించాడు. అతను ఇచ్చిన సమాచారంతో పెనుగోలు గ్రామంలో రా ములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 120 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన బానోతు జయరాం నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నాడని చెప్పడంతో అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా జయరాంకు సరఫరా చేసే గుంటూరుకు చెందిన తరిగొప్పల శ్రీనివాసరావు మైలవర ం రావడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకొని, వారిని గుంటూరులోని శ్రీనివాసరావు దుకాణం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నిల్వ ఉన్న 37 బస్తాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బస్తాలో 120 ప్యాకెట్ల చొప్పున ఉన్నాయి.
మరో కేసులో..
మోతె పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఈ నెల 9న మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలోని వెలుగు శ్రీను ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయని దాడి చేశారు. ఇంట్లో అడ్వాన్స్ 333, అరుణోదయ కంపెనీకి చెందిన 98 నకిలీ పత్తి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా రు. శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనుకు బంధువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహన అనే వ్యక్తితో కలిసి మోతె మండల పరిధిలోని గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. పోలీసులు ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లి శాతవాహనను అదుపులోకి తీసుకొని 30 ప్యాకెట్ల విత్తనాలు లభించాయి. అతనిని విచారించగా కర్ణాటక రాష్ట్రం నలుగునూర్కు చెందిన తిరుమల్ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నాడని చెప్పాడు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న శ్రీను, శాతవాహన, తిరుమల్పై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.రెండు లక్షల విలువ చేసే 58 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలు పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందచేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ యు. రవీందర్రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ వి. ప్రసన్నకుమార్, సీసీఎస్, సూర్యాపేట రూరల్, మునగాల సీఐలు శివకుమార్, గురుకుల రాజశేఖర్, రామక్రిష్ణారెడ్డి, సీసీఎస్, ఆత్మకూర్(ఎస్), మోతె ఎస్ఐలు హరిక్రిష్ణ, శ్రీకాంత్గౌడ్, యాదవేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.