VVS Laxman: ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోచ్గా లక్ష్మణ్.. గంభీర్ స్థానంలో బాధ్యతలు?
ABN , Publish Date - Jun 15 , 2025 | 09:16 PM
శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ గిల్ టీమిండియాను ఇంగ్లండ్లో ఎలా నడిపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ గిల్ టీమిండియాను ఇంగ్లండ్లో ఎలా నడిపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కోచ్ గంభీర్ (Gautam Gambhir) సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. గంభీర్ తల్లి అనారోగ్యంతో సతమతమవుతున్నారు (Ind vs Eng).
తల్లి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు గంభీర్ ఇప్పటికే ఇంగ్లండ్ నుంచి భారత్కు పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman)కు తాత్కాలికంగా టీమిండియా హెడ్కోచ్ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గంభీర్ భారత్ నుంచి ఇంగ్లండ్ వెళ్లే వరకు టీమిండియా కోచ్గా లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహించబోతున్నాడట. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఛైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం అండర్-19 భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆ జట్టు పర్యటనను పర్యవేక్షించేందుకు లక్ష్మణ్ కూడా ప్రస్తుతం లండన్లోనే ఉన్నాడు.
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న లీడ్స్లో మొదలు కాబోతోంది. గంభీర్ తిరిగి ఇంగ్లండ్ వెళ్లే వరకు టీమిండియా హెడ్కోచ్ బాధ్యతలు చేపట్టమని బీసీసీఐ ఇప్పటికే లక్ష్మణ్ను ఆదేశించినట్టు సమాచారం. అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు లండన్ వెళ్తాడనే విషయంలో ఇప్పటికి ఇంకా స్పష్టత లేదు. లక్ష్మణ్ గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 సిరీస్కు భారత జట్టు కోచ్గా వ్యవహరించాడు.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి