Share News

ఇంగ్లండ్‌ టూర్‌కు శ్రీచరణి అరుంధతి

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:18 AM

ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి, తెలంగాణ క్రీడాకారిణి అరుంధతి రెడ్డిలకు చోటు దక్కింది...

ఇంగ్లండ్‌ టూర్‌కు శ్రీచరణి అరుంధతి

టీ20, వన్డేలకు మహిళల జట్ల ఎంపిక

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి, తెలంగాణ క్రీడాకారిణి అరుంధతి రెడ్డిలకు చోటు దక్కింది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం గురువారం ప్రకటించిన జట్టులో గాయపడిన సురుచి ఉపాధ్యాయ్‌ స్థానాన్ని లెఫ్టామ్‌ స్పిన్నర్‌ రాధా యాదవ్‌తో భర్తీ చేశారు. ఈ నెల 28 నుంచి జరిగే టూర్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

జట్లు ఇవే..

టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్‌, యాస్తిక భాటియా (ఇద్దరూ వికెట్‌ కీపర్లు), హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్‌ కౌర్‌, అరుంధతి రెడ్డి, క్రాంతి, సయాలి, రాధా యాదవ్‌.

వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, ప్రతికా రావల్‌, హర్లీన్‌, జెమీమా, రిచా ఘోష్‌, యాస్తిక భాటియా (ఇద్దరూ వికెట్‌ కీపర్లు), తేజల్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్‌ కౌర్‌, అరుంధతి రెడ్డి, క్రాంతి, సయాలి, రాధా యాదవ్‌.


ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌..

జూన్‌ 28 తొలి టీ20 నాటింగ్‌హామ్‌

జూలై 1 రెండో టీ20 బ్రిస్టల్‌

జూలై 4 మూడో టీ20 ఓవల్‌

జూలై 9 నాలుగో టీ20 మాంచెస్టర్‌

జూలై 12 ఐదో టీ20 బర్మింగ్‌హామ్‌

వన్డే సిరీస్‌

జూలై 16 తొలి వన్డే సౌతాంప్టన్‌

జూలై 19 రెండో వన్డే లార్డ్స్‌

జూలై 22 మూడో వన్డే చెస్టర్‌ లి స్ట్రీట్‌

ఇవీ చదవండి:

టీమిండియాకు రెండే ఆప్షన్లు

బీసీసీఐ కొత్త రూల్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:19 AM