Share News

Rahul Dravid: నేనూ బెంగళూరు నుంచే వచ్చా.. అక్కడి అభిమానులు ఎలా ఉంటారంటే: రాహుల్ ద్రవిడ్

ABN , Publish Date - Jun 10 , 2025 | 09:26 PM

దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

Rahul Dravid: నేనూ బెంగళూరు నుంచే వచ్చా.. అక్కడి అభిమానులు ఎలా ఉంటారంటే: రాహుల్ ద్రవిడ్
Rahul Dravid

దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఐపీఎల్ (IPL 2025) టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఏకంగా 11 మంది ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయాలపాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది (Bengaluru Stampede).


ఆ విషాద ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. `బెంగళూరు ప్రజలకు క్రీడలంటే చాలా ఇష్టం. క్రికెట్ మాత్రమే కాదు.. ఫుట్‌బాల్, కబడ్డీ వంటి ఆటలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. నేను కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చాను. అక్కడి అభిమానులు క్రీడాకారులను ఎంతగానో ప్రేమిస్తారు. ఆర్సీబీ గెలుపును ఎంతగానో స్వంతం చేసుకున్నారు. అలాంటి సంతోషకర సమయంలో ఆ దుర్ఘటన జరగాల్సింది కాదు. అది చాలా విచారకర ఘటన. నిజంగా హృదయ విదారకం` అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.


ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ద్రవిడ్ నివాళులు అర్పించాడు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి.

ఇవీ చదవండి:

రింకూతో భువీ డ్యాన్స్

అమ్మకానికి ఆర్సీబీ?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 09:28 PM