Rahul Dravid: నేనూ బెంగళూరు నుంచే వచ్చా.. అక్కడి అభిమానులు ఎలా ఉంటారంటే: రాహుల్ ద్రవిడ్
ABN , Publish Date - Jun 10 , 2025 | 09:26 PM
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఐపీఎల్ (IPL 2025) టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఏకంగా 11 మంది ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయాలపాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది (Bengaluru Stampede).
ఆ విషాద ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. `బెంగళూరు ప్రజలకు క్రీడలంటే చాలా ఇష్టం. క్రికెట్ మాత్రమే కాదు.. ఫుట్బాల్, కబడ్డీ వంటి ఆటలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. నేను కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చాను. అక్కడి అభిమానులు క్రీడాకారులను ఎంతగానో ప్రేమిస్తారు. ఆర్సీబీ గెలుపును ఎంతగానో స్వంతం చేసుకున్నారు. అలాంటి సంతోషకర సమయంలో ఆ దుర్ఘటన జరగాల్సింది కాదు. అది చాలా విచారకర ఘటన. నిజంగా హృదయ విదారకం`
అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ద్రవిడ్ నివాళులు అర్పించాడు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి