Share News

Messi: భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. ధ్రువీకరించిన కేరళ మంత్రి

ABN , Publish Date - Jun 07 , 2025 | 09:33 PM

మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కేరళలో పర్యటిస్తుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్, నవంబర్‌లో ఈ పర్యటన ఉండొచ్చని తెలిపారు.

Messi: భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. ధ్రువీకరించిన కేరళ మంత్రి
Lionel Messi Kerala match

ఇంటర్నెట్ డెస్క్: స్టార్ ఫుట్‌బాలర్ లయోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కేరళకు రానుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుర్ రెహ్‌మాన్ తాజాగా ధ్రువీకరించారు.

మెస్సీ పర్యటన గురించి కేరళ ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. అర్జెంటీనా జట్టు కోసం ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఏర్పాటు చేసినట్టు అప్పట్లో వెల్లడించింది. ఆ తరువాత ఆరు నెలల పాటు ఈ విషయంలో ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సందిగ్ధత మొదలైంది. ఆ తరువాత అర్జెంటీనా పర్యటన రద్దయినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. ఒప్పందానికి సంబంధించి స్పాన్సర్‌తో విభేదాలే ఇందుకు కారణమన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఈవెంట్‌కు స్పాన్సర్ అయిన రిపోర్టర్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీతో పాటు కేరళ మంత్రి కూడా ఈ వార్తలను ఖండించారు. ప్రణాళిక ప్రకారం, కేరళలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుందని అన్నారు.


తాజాగా ఈ విషయమై మంత్రి మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మెస్సి వస్తాడు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఈ ఈవెంట్ సాకారమయ్యేందుకు సహకరించిన స్పాన్సర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతుకుముందు మీడియాతో మాట్లాడుతూ మ్యాచ్ ఫీజు చెల్లింపుల్లో జాప్యం జరిగిందని అన్నారు. అయితే, ఆ సమస్య పరిష్కారమైయ్యిందని చెప్పారు. ‘స్పాన్సర్ డబ్బును చెల్లించారు. ఇక ఎలాంటి అడ్డంకులు లేవు. ఫీఫా షెడ్యూల్ ప్రకారం, అర్జెంటీనా జట్టు పర్యటనకు అక్టోబర్-నవంబర్ సమయం అనుకూలం. ఇది మాకూ అనుకూల సమయమే’ అని అన్నారు. అయితే, ఈ ఆర్థిక వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇది కేవలం స్పాన్సర్, అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు సంబంధించిన వ్యవహారమని అన్నారు.


ఇక చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యాక ఆర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్, స్పాన్సర్ ఈ పర్యటన గురించి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తారు. ఇక ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తిరువనంత పురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. కేరళ క్రీడారంగంలో కొత్త ఉత్సాహం నింపి యువతను ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

లండన్‌కు విరాట్, అనుష్క.. మండిపడుతున్న నెటిజన్లు

బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 11:58 PM