IPL 2025 RCB vs LSG: పంత్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - May 27 , 2025 | 09:29 PM
సీజన్ అంతా పేలవ ఫామ్తో సతమతమైన లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఎట్టకేలకు తన బ్యాట్కు పని చెప్పాడు. చిట్ట చివరి మ్యాచ్లో మెరుపు శతకంతో అదరగొట్టాడు. మరోవైపు టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు పేలవ ప్రదర్శన చేశారు.

సీజన్ అంతా పేలవ ఫామ్తో సతమతమైన లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఎట్టకేలకు తన బ్యాట్కు పని చెప్పాడు. చిట్ట చివరి మ్యాచ్లో మెరుపు శతకంతో అదరగొట్టాడు (LSG vs RCB). మరోవైపు టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు పేలవ ప్రదర్శన చేశారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ రోజు లఖ్నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి (RCB vs LSG).
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్నవూ బ్యాటింగ్కు దిగింది. మార్క్రమ్ స్థానంలో ఓపెనింగ్కు దిగిన మాథ్యూ (14) త్వరగానే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (67) తన ఫామ్ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్) తన సత్తా ఏంటో చూపించాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. లఖ్నవూ భారీ స్కోరుకు బాటలు వేశాడు. మార్ష్, పంత్ రెండో వికెట్కు 150కి పైగా పరుగులు జోడించారు.
మార్ష్ అవుటైన తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (13) వేగంగా పరుగులు చేశాడు. దీంతో లఖ్నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది. కాగా, ఈ సీజన్కు సంబందించి ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలుకాబోతున్నాయి. కాగా, ఇప్పటికే ఆర్సీబీ తాజా ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా, లఖ్నవూ సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ టాప్-2కు చేరుకుంటుంది.
ఇవీ చదవండి:
టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి