మనోళ్లు 21 మంది బాక్సింగ్ పసిడి పోరుకు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:56 AM
జూనియర్ ఆసియా చాంపియన్షి్ప్సలో భారత బాక్సర్లు దుమ్ము రేపుతున్నారు. ఆరుగురు మహిళలు సహా మొత్తం ఏడుగురు బాక్సర్లు...

అమ్మాన్ (జోర్డాన్): జూనియర్ ఆసియా చాంపియన్షి్ప్సలో భారత బాక్సర్లు దుమ్ము రేపుతున్నారు. ఆరుగురు మహిళలు సహా మొత్తం ఏడుగురు బాక్సర్లు అండర్-17 ఫైనల్స్లో అడుగుపెట్టారు. ఈ చాంపియన్షి్ప్సలో భారత్ ఇప్పటికే 43 పతకాలు ఖాయం చేసుకోగా అండర్-15, అండర్-17 విభాగాలలో 21 మంది బాక్సర్లు స్వర్ణం కోసం తలపడనున్నారు. అండర్-17 మహిళల కేటగిరీలో అహాన శర్మ (50కి.), ఖుషీచంద్ (44-46కి.), జనత్ (54కి.), సిమ్రన్జీత్ కౌర్ (60కి.), హరిస్కా (63కి.), అన్షిక (80+కి.) ఫైనల్లో ప్రవేశించారు. పురుషుల అండర్- 17 కేటగిరీలో దేవాన్ష్ (80కి.) పసిడి పతక పోరుకు చేరాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..