Share News

Josh Hazlewood: భారత్-పాక్ వివాదం.. తనకు సంబంధం లేకుండా బలైన హాజెల్‌వుడ్

ABN , Publish Date - May 14 , 2025 | 07:39 PM

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దాడులు ప్రస్తుతానికి తగ్గినప్పటికీ రెండు దేశాల మధ్య మాటల దాడులు మాత్రం ఆగడం లేదు. రాజకీయంగా వేడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇరు దేశాల గురించి రకరకాల ఫేక్ పోస్ట్‌లు ప్రత్యక్ష్యమవుతున్నాయి.

Josh Hazlewood: భారత్-పాక్ వివాదం.. తనకు సంబంధం లేకుండా బలైన హాజెల్‌వుడ్
Josh Hazlewood

భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య దాడులు ప్రస్తుతానికి తగ్గినప్పటికీ రెండు దేశాల మధ్య మాటల దాడులు మాత్రం ఆగడం లేదు. రాజకీయంగా వేడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇరు దేశాల గురించి రకరకాల ఫేక్ పోస్ట్‌లు ప్రత్యక్ష్యమవుతున్నాయి. సంబంధం లేని వ్యక్తుల పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేసి వారి పేరుతో ఫేక్ మెసేజ్‌లను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ వివాదంలోకి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాష్ హాజెల్‌వుడ్ (Josh Hazlewood) పేరు రావడంతో అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.


హాజెల్‌వుడ్ సోషల్ మీడియా ద్వారా భారత్‌కు అనుకూలంగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ``మీ పోరాటం కేవలం భారత్‌ కోసమే కాదు.. సురక్షితమైన ప్రపంచం కోసం`` అని జాష్ హాజెల్‌వుడ్ భారత సైన్యానికి మద్దతు పలికినట్టు సోషల్ మీడియాలో ఓ ఫేక్ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో హాజెల్‌వుడ్‌పై పాక్ అనుకూల వాదులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ విమర్శల గురించి ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు మొదలయ్యాయి.


ఆ ఫేక్‌న్యూస్ వార్తలు బాగా వైరల్ కావడంతో హాజెల్‌వుడ్ మేనేజర్ స్పందించారు. హాజెల్‌వుడ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ట్విటర్‌లో కానీ అకౌంట్లు లేవని స్పష్టం చేశారు. హాజెల్‌వుడ్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ యాజమాన్యం ఆ ఫేక్ అకౌంట్ నుంచి ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేసింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 07:39 PM