Share News

తుదిజట్టు కూర్పుపైనే దృష్టంతా

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:32 AM

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సకు ముందు ఏకైక ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత సీనియర్‌ జట్టు సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరిగే నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎతో టీమిండియా తలపడనుంది...

తుదిజట్టు కూర్పుపైనే దృష్టంతా

నేడు భారత జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌

బెకెన్‌హామ్‌ (కెంట్‌): ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సకు ముందు ఏకైక ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత సీనియర్‌ జట్టు సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరిగే నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎతో టీమిండియా తలపడనుంది. భారత ప్లేయర్ల మధ్య అంతర్గత మ్యాచ్‌ కావడంతో.. టెస్ట్‌ జట్టు కూర్పుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యానికి ఈ మ్యాచ్‌ ఓ పరీక్షగానే చెప్పుకోవాలి. ఇక, తుది జట్టులో జడేజా లేదా కుల్దీ్‌పలో ఎవరిని తీసుకోవాలనేదానిపై కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఓ నిర్ణయానికి రావచ్చు. మరోవైపు ఆరు నెలల తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న పేసర్‌ బుమ్రా ఫిట్‌నె్‌సను నిశితంగా గమనించనున్నారు. వెన్నెముక గాయంతో విశ్రాంతి తీసుకొన్న బుమ్రా ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణల్లో ఎవరు కెప్టెన్‌ నమ్మకాన్ని గెల్చుకుంటారో ఈ మ్యాచ్‌తో బయటపడనుంది. అలాగే తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి, ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న శార్దూల్‌ ఠాకూర్‌లలో ఎవరు బెర్త్‌ దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బ్యాటర్లకు బ్యాటింగ్‌ ప్రాక్టీ్‌సతోపాటు బౌలర్లు లయను అందుకోవడానికి ఈ మ్యాచ్‌ ఎంతో ఉపయోగపడనుంది.


ఇవీ చదవండి:

టీమిండియాకు రెండే ఆప్షన్లు

బీసీసీఐ కొత్త రూల్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:32 AM