Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
ABN , Publish Date - May 17 , 2025 | 06:59 PM
ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో శుక్రవారం కొత్త స్టాండ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీమిండియాతో పాటు ముంబై క్రికెట్కు రోహిత్ అందించిన సేవలకు గానూ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్కు అతడి పేరును పెట్టి గౌరవించింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ (Rohit Sharma) పేరుతో శుక్రవారం కొత్త స్టాండ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీమిండియాతో పాటు ముంబై క్రికెట్కు రోహిత్ అందించిన సేవలకు గానూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్కు అతడి పేరును పెట్టి గౌరవించింది. శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సహా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు (Rohit Sharma Stand). ఈ గౌరవ కార్యక్రమంపై టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన స్పందనను తెలియజేశాడు.
హే రోహిత్.. ఈ గౌరవానికి నీవు పూర్తిగా అర్హుడివి. వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్లోకి నువ్వు ఎన్నో సిక్స్లు పంపించావు. అందుకే ఈ రోజు నీ పేరుతో ఆ స్టేడియంలో ఓ స్టాండ్ వచ్చింది. భారత క్రికెట్, ముంబై జట్టుకు నీవు అందించిన సేవలకు దక్కిన రివార్డ్ ఇది. నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇది ఎంతో అద్భుతమైన క్షణం. ఈ స్టేడియంలో నువ్వు మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాలని కోరుకుంటున్నా. వాంఖడే స్టేడియం టిక్కెట్లు నాకు కావాల్సి వస్తే ఇప్పుడు ఎవరిని అడగాలో నాకు తెలుసు అంటూ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
ద్రవిడ్ మాట్లాడిన ఆ వీడియోను ముంబై ఇండియన్స్ టీమ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా ఉండగా, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కొన్ని చిరస్మరణీయ విజయాలు సాధించింది. టీ-20 ప్రపంచకప్ గెలుచుకుంది. అలాగే 2023 వన్డే ప్రపంచకప్లో ఫైనల్ వరకు వెళ్లింది. అలాగే విదేశాల్లో కూడా అద్భుతమైన విజయాలు అందుకుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..