ఇదే సరైన సమయం
ABN , Publish Date - Jun 13 , 2025 | 02:34 AM
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు సత్తా నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సూచించాడు....

ప్రతీ బంతికీ పోరాడండి
భారత ఆటగాళ్లకు కోచ్ గంభీర్ సలహా
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు సత్తా నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సూచించాడు. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు స్పిన్నర్ అశ్విన్ లేకుండానే టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆటగాళ్లంతా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చాడు. ఈనెల 20 నుంచి సిరీస్ జరుగనుంది. ‘ఈ టూర్ను మనం రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది ముగ్గురు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనున్నాం. రెండోది దేశం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మనకు ఓ అద్భుతమైన అవకాశం దక్కింది. ప్రస్తుత జట్టులో తమను తాము నిరూపించుకోవాలనే తపన, నిబద్ధత కనిపిస్తున్నాయి. అయితే ఈ టూర్ను చిరస్మరణీయం చేసుకోవాలంటే మనం సౌకర్యవంతమైన జోన్ నుంచి బయటకు రావాల్సిందే. ప్రతి రోజు, ప్రతీ సెషన్, ప్రతీ గంట, ప్రతీ బంతికి కూడా పోరాడితేనే ఫలితం దక్కించుకుంటాం’ అని ప్రాక్టీస్ సందర్భంగా జట్టు సభ్యులతో గంభీర్ అన్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి