Share News

Hero Vishal: హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..

ABN , Publish Date - Jun 07 , 2025 | 07:40 AM

Hero Vishal: 2019లో ఓ సినిమా నిర్మాణం కోసం హీరో విశాల్ గోపురం ఫిల్మ్స్ అధినేత అన్బు చెలియన్ దగ్గర 15 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. కొత్త సినిమా తీస్తే ఆ రైట్స్ గోపురం ఫిల్మ్స్‌కు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది.

Hero Vishal: హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..
Hero Vishal

తమిళ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్‌కు 21.29 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. అది కూడా 30 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. మద్రాస్ కోర్టు తీసుకున్న నిర్ణయంతో విశాల్ ఏకీభవిస్తారా.. లేక పైకోర్టుకు వెళతారా అన్నది తెలియాలి. ఇక, విశాల్.. లైకా సంస్థకు మధ్య గత కొన్నేళ్ల నుంచి ఆర్థికపరమైన గొడవలు నడుస్తున్నాయి. విశాల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే 2019లో ఓ సినిమా నిర్మాణం కోసం గోపురం ఫిల్మ్స్ అధినేత అన్బు చెలియన్ దగ్గర 15 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. కొత్త సినిమా తీస్తే ఆ రైట్స్ గోపురం ఫిల్మ్స్‌కు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది. విశాల్ ఆ అప్పును తీర్చలేని పరిస్థితిలో ఉండటంతో లైకా ప్రొడక్షన్స్ సాయం చేయడానికి వచ్చింది. అన్బు చెలియన్‌కు విశాల్ కట్టాల్సిన మొత్తాన్ని కట్టేసింది. దీంతో తాను తీయబోయే సినిమా రైట్స్ లైకాకు ఇస్తానని విశాల్ భరోసా ఇచ్చాడు. అయితే, విశాల్ తన కొత్త సినిమా రైట్స్ లైకాకు ఇవ్వలేదు.


15 కోట్ల రూపాయలు వడ్డీతో కలిసి 21.29 కోట్ల రూపాయలు అయింది. విశాల్ ఆ అప్పు కూడా కట్టలేదు. ఆయన తీసిన కొత్త సినిమాను వేరే కంపెనీలకు అమ్మేశాడు. దీంతో లైకా కోర్టును ఆశ్రయించింది. 2021 నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. కోర్టు తాజాగా లైకా సంస్థకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. మొత్తం 21.29 కోట్ల రూపాయల్ని 30 శాతం వడ్డీతో ఇవ్వాల్సిందేనని విశాల్‌ను ఆదేశించింది. శారీరకంగా, మానసికంగా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న విశాల్‌కు భారీ దెబ్బ తగిలినట్లు అయింది. ఆయన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ

Updated Date - Jun 07 , 2025 | 07:48 AM