రిటైర్ అవుతున్నారా.. గ్రాచ్యుయిటీ ఎంత వస్తుందో ఇలా లెక్కించుకోండి
ABN, Publish Date - May 23 , 2025 | 05:40 PM
సుదీర్ఘ సర్వీసు తరువాత రిటైర్ అయ్యే వారు తమకు గ్రాచ్యుయిటీ ఎంత వస్తుందో లెక్కించేందుకు రెండు ఫార్ములాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

సుదీర్ఘకాలం పాటు ఓ సంస్థలో నమ్మకంగా పనిచేసినందుకు ఇచ్చే నజరానానే గ్రాచ్యుయిటీ అంటారు. ఈ చెల్లింపులన్నీ గ్రాచ్యుయిటీ యాక్ట్ - 1972 పరిధిలోకి వస్తాయి. కనీసం పది మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థకూ ఈ చట్టం వర్తిస్తుంది. ఒక సంస్థలో కనీసం 5 ఏళ్ల పాటు పనిచేసిన వారందరూ గ్రాచ్యుయిటీకి అర్హులు

గ్రాచ్యుయిటీ ఎంత చెల్లించాలనే దానికి ఓ ఫార్ములా ఉంది. దీని ఆధారంగా అర్హులైన ఉద్యోగులు తమ కొచ్చే మొత్తం ఎంతో సులువుగా లెక్కించుకోవచ్చు. ఈ వివరాలను ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత కంపెనీలకు ఉంది.

ఇక గ్రాచ్యుయిటీ చట్టం కింద రిజిస్టర్ కానీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఈ మొత్తం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇందుకు సంస్థలు మరో ఫార్ములాను ఎంచుకుంటాయి.

గ్రాచుయిటీ పరిధిలోకి వచ్చే వారికి వర్తించే ఫార్ములా (చివరిసారిగా తీసుకున్న శాలరీ బేసిక్ + డీఏ) x (15/26) x (సంస్థలో పనిచేసిన కాలం).

గ్రాచ్యుయిటీ పరిధిలోకి రాని వారిని వర్తించే ఫార్ములా (15 × చివరిసారిగా తీసుకున్న శాలరీ × సంస్థలో పని చేసిన కాలం)/30.

ఈ ఫార్ములా ప్రకారం, 15 ఏళ్ల సర్వీసు తరువాత రూ.25 వేల శాలరీతో రిటైర్ అయ్యే వాళ్లకు రూ. 216346.15 గ్రాచ్యుయిటీ కింద వస్తుంది.

ఇక 15 ఏళ్ల సర్వీసుతో రూ.50 శాలరీ తీసుకుని రిటైర్ అయ్యే వారికి 4,32,692.30 గ్రాచ్యుయిటీ చెల్లిస్తారు.

ఇక లక్ష రూపాయల జీతం పొందే వారికి రిటైర్మెంట్ సమయంలో రూ. 8,65,384.61, గ్రాచ్యుయిటీ వస్తుంది.
Updated at - May 23 , 2025 | 05:40 PM