SATA Central : సౌదీలోని భారతీయ ఎంబసీ దౌత్యవేత్తలతో సాటా సెంట్రల్ బృందం సమావేశం
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:35 PM
తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు సౌదీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి సాటా సెంట్రల్ ప్రతినిధుల బృందం ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రియాధ్లోని ప్రముఖ తెలుగు ప్రవాసీయుల సంఘమైన సాటా సెంట్రల్ ప్రతినిధులు సోమవారం భారతీయ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉప రాయబారి (డి.సి.యం) ఆబూ యం. జార్జ్, సీనియర్ దౌత్యవేత్త వై.సాబీర్లతో సమావేశమైన బృందంలో సాటా సెంట్రల్ ప్రతినిధులు శిల్పా, అక్షిత, రంజీత్, ఎర్రన్న, ముజ్జమ్మీల్, ఆనందరాజు, అర్చన, చేతన, యాఖూబ్లు ఉన్నారు.
తెలుగు ప్రవాసీ సమాజం కోసం సాటా సెంట్రల్ చేస్తున్న సేవలను భారతీయ అధికారులు ప్రశంసించారని ప్రతినిధులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు
సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు