TASA: రియాధ్లో టాసా ప్రతినిధుల సమావేశం
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:18 PM
తెలుగు సంస్కృతి పరిరక్షణ, వికాసం కోసం ప్రవాసాంధ్ర సంఘం టాసా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా) చేస్తున్న ప్రయత్నాలను సంఘం ప్రతినిధులు భారతీయ ఎంబసీ అధికారులకు వివరించారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ప్రవాసాంధ్రులలో తెలుగు సంస్కృతి పరిరక్షణ, వికాసం కోసం ప్రవాసాంధ్ర సంఘమైన టాసా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా) చేస్తున్న ప్రయత్నాలను సంఘం ప్రతినిధులు భారతీయ ఎంబసీ అధికారులకు వివరించారు.
ఈ మేరకు టాసా ప్రతినిధి బృందం దాని అధ్యక్షుడు స్వర్ణ స్వామి ఆధ్వర్యంలో గురువారం భారతీయ ఎంబసీ ఉన్నతాధికారులయిన డి.సి.యం మాజిన్ ఎ. జార్జీ, సి.డబ్ల్యూ కౌన్సల్ అయిన వై.సాబీర్లో సమావేశమైంది. టాసా ప్రతినిధుల బృందంలో స్వామితో పాటు మురారి, మహేంద్ర, ఇబ్రహీం షేఖ్, అనిల్ మర్రి, అజయ్ రావూరి, రవి మేడూరి, కేదార్, బిందు గంధవల్లి, శ్రీదేవి, సింధూ పోకూరి, సమయ్యా, సాయి నాగదుర్గలు ఉన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు, రక్తదానం, ప్రవాసీయులకు వివిధ సందర్భాలలో చేస్తున్న విభిన్న సేవా కార్యక్రమాల గురించి తమ బృందం అధికారులకు వివరించిందని స్వామి తెలిపారు. తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు భారతీయ ఎంబసీ చేయూతనిస్తుందని అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియాలో దారుణం.. అరెస్టు సమయంలో తీవ్ర గాయాలు.. కోమాలో భారత సంతతి వ్యక్తి
అమెరికాలో భారతీయ యువతికి షాక్.. ఏకంగా 5 వేల డాలర్ల నష్టం