ముఖం మెరిపిద్దామిలా
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:07 AM
అందం కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే రసాయనాలు ఉండే సౌందర్యసాధనాలు వాడకుండా, ఇంట్లో ఉండే వాటితోనే సహజంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖం అందంగా మార్చుకోవచ్చు...

అందం కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే రసాయనాలు ఉండే సౌందర్యసాధనాలు వాడకుండా, ఇంట్లో ఉండే వాటితోనే సహజంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖం అందంగా మార్చుకోవచ్చు.
ఒక గిన్నెలో నాలుగు చెంచాల శనగపిండి, కొంచెం పసుపు, రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ అంతా ప్యాక్లా వేయాలి. అరగంట తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది.
పావు కప్పు బొప్పాయి గుజ్జులో ఒక చెంచా తేనే వేసి కలిపి ముఖంపై రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడగాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయి.
అరకప్పు దోస ముక్కలను పేస్టులా చేసి అందులో చెంచా పెరుగు కలిపి ముఖం, మెడకు పట్టించి ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఈ ప్యాక్తో చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.
ఒక పండిన అరటిపండును గుజ్జుల చేసి, అందులో ఒక చెంచా పాలు, చెంచా తేనె వేసి కలపాలి. దీనిని ముఖంపై రాస్తూ సున్నితంగా మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. దీని వల్ల చర్మంపై మురికి పోయి మెరుస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల బార్లీ గింజల పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం వేడి నీళ్లు పోసి ముద్దలా చేయాలి. దీనిని ముఖంపై రాసి పావు గంట తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల చర్మంపై మృతకణాలు తొలగి ముఖం అందంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..