Share News

Celebi Aviation: తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్‌ అనుమతులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

ABN , Publish Date - May 15 , 2025 | 08:19 PM

భారత ఎయిర్‌పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్ అనుమతులను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాజాగా రద్దు చేసింది. పాక్‌కు తుర్కియే మద్దతు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Celebi Aviation: తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్‌ అనుమతులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..
Celebi Aviation licence revoked

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడికి కారణమైన పాక్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియేకు భారత్ తొలి షాకిచ్చింది. తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్‌ సంస్థకు మంజూరు చేసిన భద్రతా పరమైన అనుమతులను రద్దు చేసింది. భారత్‌లోని తొమ్మిది ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో సెలెబీ ఏవియేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. క్రిటికల్ ప్యాసెంజర్, కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తుంది. ఇందుకోసం గతంలో ఈ సంస్థకు ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రత దృష్టా అనుమతులను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది.


ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, కన్నూర్, చెన్నై, గోవాలోని ఎమ్ఓపీఏ ఎయిర్‌పోర్టుల్లో సెలెబీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ ఎయిర్‌పోర్టుల్లోని విదేశీ ఎయిర్‌లైన్స్‌తోపాటు కార్గో ఆపరేటర్లకూ సంస్థ సేవలందిస్తుంటుంది. వైజాగ్ ఎయిర్‌పోర్టు బాధ్యతలు సైతం ఈ సంస్థకు దఖలు పడాల్సి ఉండగా ఇంతలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసింది.

అంతకుముందు సెలెబీపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టుకు లేఖ రాసింది. జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌కు తుర్కియే వంత పాడుతున్న విషయాన్ని ప్రస్తావించింది.


దీనిపై మంగళవారం సెలెబీ సంస్థ సీఈఓ లేఖ రాశారు. తాము భారతీయ వ్యాపారసంస్థగా మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ కార్యకలాపాలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. స్థానిక మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టామని, ఇక్కడి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. తమ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ, ఎఫ్‌డీఐ అనుమతులు ఉన్నాయన్నారు. బోర్డు డైరెక్టర్లలో ఎవరూ తుర్కియే జాతీయులు కాదని అన్నారు. ముంబైలో తమ సంస్థలో 3 వేల మంది భారతీయులు ఉన్నారని చెప్పుకొచ్చారు. పోలీసుల తనిఖీల తరువాతే తమ ఉద్యోగులు ఎంపిక అయ్యారని వెల్లడించారు. తాము పూర్తి వ్యాపార సంస్థని రాజకీయ సంబంధాలు, అభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అయినా సెలెబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయ్యాయి. అయితే దీనిపై సెలెబీ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.

Also Read:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే.. వీటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 09:16 PM