PM Kisan Updates: పీఎం కిసాన్పై బిగ్ అప్డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:21 PM
కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఈ పథకం ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుల పేర్లను పథకం నుంచి తొలగించటంపై క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టులో.. ‘చాలా మంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు. అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు. కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి అప్లై చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు. బెనిఫిషియరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్లు అర్హులని తేలితే పేర్లు మళ్లీ లిస్ట్లో యాడ్ అవుతాయి. అనర్హులని తేలితే పథకం వర్తించదు‘ అని స్పష్టం చేసింది.
కాగా, పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 20 విడతల్లో రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. గత ఆగస్టు నెలలో 2 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో పడ్డాయి. 21వ విడతకు సంబంధించిన డబ్బుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఉత్తర భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి కేంద్రం ముందుగానే డబ్బులు జమచేసింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగటంతో.. జమ్మూకాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పీఎమ్ కిసాన్ 21వ విడత డబ్బులు ముందుగానే పడ్డాయి.
ఇవి కూడా చదవండి
మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు.. ఎందుకంటే
13 చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి..