Share News

Air India: విమాన ప్రమాదం.. బాధితులకు ఎయిర్ ఇండియా అదనపు ఆర్థిక సాయం

ABN , Publish Date - Jun 14 , 2025 | 07:03 PM

విమాన ప్రమాద బాధితులను ఆదుకునేందుకు రూ.25 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది.

Air India: విమాన ప్రమాదం.. బాధితులకు ఎయిర్ ఇండియా అదనపు ఆర్థిక సాయం
Air India

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంస్థ తక్షణ ఆర్థిక సాయం ప్రకటించింది. మధ్యంతర సాయం కింద బాధితులకు రూ.25 లక్షలు (21 వేల జీబీపీ) ఇవ్వనున్నట్టు ప్రకటించింది. బాధితులకు గతంలో టాటా సన్స్ ప్రకటించిన రూ. కోటి ఆర్థిక సాయానికి ఇది అదనమని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎయిర్ ఇండియా పోస్టు పెట్టింది.

ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తాము అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎయిర్ ఇండియా పేర్కొంది. బాధిత కుటుంబాలకు సాయం కోసం క్షేత్రస్థాయిలో తమ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపింది. ఇందులో భాగంగానే మధ్యంతర ఆర్థిక సాయం ప్రకటించినట్టు వెల్లడించింది. ప్రమాద ఘటన తమను ఎంతో కలచివేసిందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్

హైపర్‌ సోనిక్ మిసైల్స్‌తో ప్రమాదం.. ఇస్రో మాజీ చీఫ్ కీలక కామెంట్స్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 07:12 PM