Railway Luggage Limit: రైలు ప్రయాణమా.. మీ లగేజీ బరువు ఈ పరిమితి దాటితే..
ABN , Publish Date - May 18 , 2025 | 09:19 PM
రైలు ప్రయాణికులు తమ వెంట ఎంత బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ పరిమితి దాటితే భారీగా జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణాలంటే చాలు జనాలు తమ వెంట బోలెడంత లగేజీ తీసుకుని వెళతారు. అయితే, రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లచ్చు అనే అంశంపై భారతీయ రైల్వే స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలు మీరితే భారీగా జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి రైళ్లల్లో లగేజీ రూల్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
లగేజీపై పరిమితులు ఆయా కోచ్లను బట్టి ఉంటాయి. ఏసీ కోచ్లో ప్రయాణించే వారికి లగేజీ పరిమితి కాస్త ఎక్కువ. ఉదాహరణకు మీరు ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కున్నట్టైతే వెంట 70 కిలోల బరువున్న లగేజీని వెంట తీసుకెళ్లొచ్చు.
ఇక సెకెండ్ క్లాస్లో వెళ్లే వారు తమ వెంట 50 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు. అదనంగా మరో 10 కేజీలకు కూడా అనుమతిస్తారు. ఇక స్లీపర్ క్లాసులో ప్రయాణించే వారు తమ వెంటనే (40+10) కేజీల వరకూ లగేజీని తీసుకెళ్లనిస్తారు.
ఇక థర్డ్ క్లాస్లో వెళ్లేవారు తమ వెంట 40 కేజీల బరువున్న లగేజీని తీసుకెళ్లొచ్చు. అదనంగా మరో 10 కేజీలు తీసుకెళ్లేందుకూ అవకాశం ఉంది. ఈ పరిమితులకు మించి లగేజీ తీసుకెళ్లాలనుకుంటే ఆ మేరకు అదనపు చార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
ముందస్తుగా బుక్ చేయకుండా లగేజీని తీసుకెళ్లి దొరికిపోతే సాధారణ చార్జీలకు ఆరు రెట్ల మేర జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక 100 కేజీలకు మించి బరువున్న సామాన్లను తరలించేందుకు ప్రత్యేకంగా లగేజీ వ్యాన్ బుక్ చేసుకోవాలి. పేలుడు పదార్థాలు, మండే గుణం ఉన్న పదార్థాలు, భారీ సైజులో ఉన్న వస్తువులను రైల్లో తరలించేందుకు అనుమతి లేదు.
ఇవి కూడా చదవండి:
రూల్స్కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
సెవెన్ సిస్టర్స్ అద్భుతాల్ని తరిస్తారా.. లక్కీ ఛాన్స్
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి