Share News

Pakistans Artillery Shortage: ఆర్టిలరీ అమ్యూనిషన్ కొరత.. 4 రోజులకు మించి యుద్ధం చేయలేని స్థితిలో పాక్

ABN , Publish Date - May 04 , 2025 | 02:41 PM

పాక్‌లో ఆర్టిలరీ అమ్యూనిషన్ కొరత తీవ్రంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితంగా పాక్ నాలుగు రోజులకు మించి యుద్ధాన్ని కొనసాగించే స్థితిలో లేనట్టు వెల్లడించాయి.

Pakistans Artillery Shortage: ఆర్టిలరీ అమ్యూనిషన్ కొరత.. 4 రోజులకు మించి యుద్ధం చేయలేని స్థితిలో పాక్
Pakistan artillery shortage

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధోన్మాదంతో పాక్ రెచ్చిపోతోంది. అక్కడి నేతల ప్రగల్భాలు ఆకాశాన్నంటుతున్నాయి. భారత్ దుస్సాహసానికి దిగితే గట్టిగా జవాబిచ్చేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పుకుంటున్నారు. తమ ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని జబ్బలు చరుచుకుంటున్నారు. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న తెలుస్తోంది. ఆర్టిలరీ ముందుగుండు సామగ్రి కొరత తీవ్రంగా ఉండటంతో సతమతమవుతున్న పాక్.. నాలుగు రోజులకు మించి యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పాక్‌లో ఎమ్109 హొవిట్సర్జ్స్‌కు కావాల్సిన 155 ఎమ్ఎమ్ షెల్స్, బీఎమ్-21 సిస్టమ్స్‌ నుంచి ప్రయోగించే 122 రాకెట్స్ కొరత తీవ్రంగా ఉంది. తమ ఆయుధ సంపత్తిలో కొంత ఉక్రెయిన్‌కు మళ్లించడంతో ఈ పరిస్థితి తలెత్తిందట. అంతర్జాతీయంగా ఆర్టిలరీ మందుగుండు సామగ్రికి డిమాండ్ పెరగడం, పాత తరం సాంకేతికతల కారణంగా దేశీయంగా ఉత్పత్తి పెంచలేక పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు చతికిల పడటం కూడా ఆర్టిలరీ అమ్యూనిషన్ కొరతకు దారి తీసింది.


అయితే, భారత్ దాడిని ప్రతిఘటించేందుకు పలు చర్యలు చేపట్టిన పాక్ ఇప్పటికే సరిహద్దు వెంబడి మందుగుండు సామగ్రిని నిల్వ చేసుకుంది. కానీ భారత్‌తో సుదీర్ఘ పోరు సలిపే ఆర్థిక, ఆయుద్ధ సంపత్తి పాక్‌కు లేదని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బజ్వా గతంలోనే ప్రకటించడం గమనార్హం. ఇటీవల జరిగిన పాక్ స్పెషల్ కోర్ కమాండర్ల సమావేశంలో కూడా మందుగుండు సామగ్రి కొరతపై ఆందోళన వ్యక్తమైనట్టు తెలుస్తోంది. మిలిటరీ నాయకత్వం ఈ విషయమై తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా నిధులకు కట్టకట ఏర్పడింది. దీంతో, పలు శిక్షణ కార్యక్రమాలకు పాక్ దళాలు


తాత్కాలిక విరామం ప్రకటించాయి. ఇంధన కొరత కారణంగా పలు యుద్ధ విన్యాసాలకు బ్రేక్ చెప్పాయి. ‘‘ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు తమ ఎమ్యునిషన్‌ను తరలించిన పాక్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది’’ అని రక్షణ రంగ విశ్లేషకులు ఒకరు అభిప్రాయపడ్డారు. పహల్గాం తరువాత పాక్ సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతోంది. వరుసగా పదో రోజూ కూడా సరిహద్దు ప్రాంతాలు బాంబు పేళుళ్లతో మారుమోగిపోయాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ

పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడు..

గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 02:42 PM