NSA Ajit Doval : పలు దేశాల సెక్కూరిటీ అడ్వైజర్లకు అజిత్ దోవల్ ఫోన్
ABN , Publish Date - May 07 , 2025 | 05:45 PM
పాక్ తో యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందని దోవల్ నొక్కి చెప్పారు.

NSA Ajit Doval briefs counterparts: ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని 9 ప్రదేశాలలో ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత దాడులు జరిగిన తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పలు దేశాల NSAలతో మాట్లాడారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, UK NSA జోనాథన్ పావెల్, సౌదీ NSA ముసైద్ అల్ ఐబాన్, UAE NSA షేక్ తహ్నూన్, UAE NSC సెక్రటరీ జనరల్ అలీ అల్ షంసి, ఇంకా జపాన్ NSA మసటకా ఒకానోతో సహా అనేక దేశాల NSAలతో అజిత్ దోవల్ ఫోన్లో సంభాషించారు.
వీరితో పాటు, CPC సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, PRC విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఇంకా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ బోన్ కు దౌత్య సలహాదారు అయిన రష్యన్ NSA సెర్గీ షోయిగుతో కూడా అజిత్ సంప్రదింపులు జరిపారు. ఈ టెలిఫోన్ సంభాషణలో NSA తన సహచరులకు.. యుద్ధంకు సంబంధించి తీసుకున్న చర్యలు, అమలు విధానం గురించి వివరించారు. అయితే, ఈ యుద్థం తీవ్రతరం కానిది, సంయమనంతో కూడినది అని ఆయన సహచరులకు తెలిపారు.
అయితే, పాక్ తో యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందని దోవల్ నొక్కి చెప్పారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి తన సహచరులతో తాను సంప్రదిస్తానని కూడా NSA అజిత్ దోవల్.. విదేశీ నేషనల్ సెక్కూరిటీ అడ్వైజర్లకు తెలిపారు. ఇదే సందర్భంలో "ఈ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు తాము కట్టుబడి ఉన్నాం" అని కూడా ఆయన విదేశీ ప్రతినిధులకు వెల్లడించారు.