Share News

Austria: ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు.. 8 మంది దుర్మరణం

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:33 PM

ఆస్ట్రియాలో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఓ స్కూల్లో కాల్పులు జరగడంతో సుమారు 8 మంది మరణించారు.

Austria: ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు.. 8 మంది దుర్మరణం
Austria school shooting

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రియాలోని ఓ స్కూల్లో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో సుమారు 8 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. గ్రాజ్ నగరంలో ఈ స్కూల్ ఉంది. కాల్పుల సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ఈ కాల్పుల్లో పలువురు మరణించినట్టు తెలిపింది. మృతుల్లో విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారా లేదా అనే అంశాలను మాత్రం వెల్లడించలేదు. గాయపడ్డ వారి వివరాలను కూడా వెల్లడించలేదు.


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన సమాచారం అందగానే ప్రత్యేక పోలీసు దళాలు స్కూల్‌కు చేరుకున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరం గ్రాజ్. దేశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. ఇక్కడి జనాభా సుమారు 3 లక్షలు.


ఇవీ చదవండి:

శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్

మస్క్‌పై కోర్టులో కేసు వేయనున్న ట్రంప్?

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 03:37 PM