Share News

పొట్లపల్లి కమల మనోహర్‌రావుపై డాక్యుమెంటరీ

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:59 AM

పొట్లపల్లి కమల మనోహర్‌రావు డిసెంబర్‌ 20, 1919న జన్మించారు. స్వగ్రామం అశ్వరావుపల్లి (రఘునాథపల్లి మండలం, జనగాం జిల్లా). ఆయన నిజాం ప్రభుత్వంలోని సామాజిక...

పొట్లపల్లి కమల మనోహర్‌రావుపై డాక్యుమెంటరీ

పొట్లపల్లి కమల మనోహర్‌రావు డిసెంబర్‌ 20, 1919న జన్మించారు. స్వగ్రామం అశ్వరావుపల్లి (రఘునాథపల్లి మండలం, జనగాం జిల్లా). ఆయన నిజాం ప్రభుత్వంలోని సామాజిక సంక్షేమశాఖలో పనిచేశారు. ఆదివాసీ సమూహాల అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటుకు కృషిచేసి సాధించారు. 1966లో గిరిజన సంక్షేమశాఖ స్థాపించినపుడు ఆయన దాని మొదటి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 1975లో పదవీ విరమణ వరకు ఆదివాసీల జీవన విధానం మెరుగుపరచడం కోసం ఎంతో కృషి చేశారు. ‘సింగిల్‌ విండో’ పరిపాలనా సూత్రాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఆదిలాబాద్‌ గోండు ఆదివాసీలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ హైమండార్ఫ్‌ కమల మనోహర్‌రావు సేవలను గుర్తించి, అభినందిస్తూ కొన్ని లేఖలు కూడా రాశారు. గోండులకు భూమి హక్కు, పట్టాలూ లభించడంలో కమల మనోహర్‌ రావు కృషి కూడా ఉంది. ఆయనపై ఒక డాక్యుమెంటరీ అధ్యయనం చేస్తున్నాం. ప్రభుత్వ అధికారిగా గిరిజన సంక్షేమానికి ఆయన చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నీ సేకరించదలచుకున్నాము. ఆయనకు సంబంధించిన సమాచారం, ఆర్టికల్స్‌, పుస్తకాలు ఉంటే మాకు తెలియచేయాలని కోరుతున్నాం. ఆయనతో పరిచయం ఉన్నవారు ఆ జ్ఞాపకాలను పంచుకోదలిస్తే, మేమే వచ్చి ఆ వివరాలు రికార్డు చేసుకుంటాము.

శ్యాంమోహన్‌

ఫోన్‌: 94405 95858;

ఈమెయిల్‌: smrm5858@gmail.com

ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:59 AM