Share News

Karnataka Teacher Stabbed: క్రికెట్ బంతి కోసం వచ్చి ఇంటి యజమానితో యువకుడి ఘర్షణ.. కత్తితో దాడి

ABN , Publish Date - May 15 , 2025 | 05:04 PM

క్రికెట్ బంతి పడిపోయిందంటూ ఓ టీచర్ ఇంటికొచ్చిన యువకుడు అతడితో ఘర్షణ పడి కత్తితో దాడి చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

Karnataka Teacher Stabbed: క్రికెట్ బంతి కోసం వచ్చి ఇంటి యజమానితో యువకుడి ఘర్షణ.. కత్తితో దాడి
Karnataka teacher stabbing

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో జనాలకు సహనం నశిస్తోంది. చిన్న చిన్న విషయాలకే భారీ స్థాయిలో గొడవ పడుతూ నేరాలకు దిగుతున్నారు. అవతలి వారికి హాని తలపెట్టడమే కాకుండా తమ జీవితాల్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. క్రికెట్ బంతి కోసం తలెత్తిన వివాదం చివరకు ఓ టీచర్ ఆసుపత్రి పాలయ్యేలా చేసింది.

బగాల్‌కోట్‌‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది. జిల్లాకు చెందిన రామప్పు పుజారీ ఓ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇంటి పక్కనే కొందరు కుర్రాళ్లు మంగళవారం క్రికెట్ ఆడారు. ఈ నేపథ్యంలో వారు కొట్టిన బంతి పుజారీ ఇంట్లో పడిందంటూ పవన్ జాదవ్ అనే వ్యక్తి టీచర్ ఇంటికి వచ్చాడు.


అయితే, బంతి తమ ఇంటివైపు రాలేదని రామప్ప సమాధానమిచ్చాడు. ఇది వారి మధ్య భారీ వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన జాదవ్ రామప్పను ఇష్టారీతిన కొట్టాడు. చివరకు పగిలిన గాజు బాటిల్‌తో పొడిచాడు. ఆపై కత్తితో కూడా దాడి చేశాడు.

ఈ దాడిలో టీచర్ ముఖం, తలపై గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో అతడికి చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

Read Latest and Crime News

Updated Date - May 15 , 2025 | 05:09 PM