Haryana: కారులో విషం తాగి కుటుంబం ఆత్మహత్య.. హర్యానాలో షాకింగ్ ఘటన
ABN , Publish Date - May 27 , 2025 | 09:17 AM
హర్యానాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వ్యక్తి, అతడి భార్యా, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పంచ్కుల జిల్లాలోని సెక్టర్ 27 లోగల ఓ ఇంటి వద్ద నిలిపి ఉంచి కారులో వారి మృతదేహాలు లభించాయి. కుటుంబ సభ్యులంతా కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో ఏముందనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. అయితే, అప్పులు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కుటుంబం డెహ్రాడూన్కు నుంచి వచ్చిందని చెప్పారు.
ఘటన సమాచారం అందగానే పంచ్కుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) అమిత్ దహియా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫారెన్సిక్ బృందం సభ్యులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన సూసైడ్ అని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
విఫలమైన వివాహం.. పెళ్లిళ్ల బ్రోకర్ను హత్య చేసిన యువకుడు