Bengaluru: త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్గా ఉండటం చూసి..
ABN , Publish Date - Jun 07 , 2025 | 06:22 PM
భార్య ఎఫైర్ గురించి తెలిసిన ఓ భర్త ఆమె తలను నరికి చంపేశాడు. తలతో సహా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: మహిళ ఎఫైర్ గురించి తెలిసి రగిలిపోయిన ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శంకర్, మానస దంపతులు స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జూన్ 3న పనికోసం వెళ్లిన శంకర్ ఏదో కారణంతో త్వరగా ఇంటికి వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే భార్య పరాయి మగాడితో సన్నిహితంగా కనిపించేసరికి షాకైపోయాడు. ఆ తరువాత వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మానస ఇంట్లోంచి వెళ్లిపోయింది.
ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ తిరిగొచ్చిన మానస భర్తతో పలు మార్లు గొడవపడింది. ఇక ఘటన జరిగిన రోజు కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంలో విచక్షణ కోల్పోయిన శంకర్ ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై శరీరం నుంచి తలను వేరు చేశాడు. భార్య తలతో సహా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
‘ఘటన జరిగిన రోజు భార్యాభర్తలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో శంకర్ మానసను కొట్టాడు. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు. తలతో సహా స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశాము. అతడి భార్యకు మరొకరితో ఎఫైర్ ఉంది. గత వారం త్వరగా ఇంటికొచ్చిన అతడికి భార్య మరొకరితో సన్నిహితంగా ఉండటం కంటపడింది. ఆ తరువాత వారి మధ్య జరిగిన గొడవలు చివరకు హత్యకు దారి తీశాయి’ అని పోలీసులు తెలిపారు.
హరిద్వార్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి మాయలో పడి ఓ వివాహిత తన కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసింది. మహిళ బాయ్ఫ్రెండ్, అతడి స్నేహితుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేలా రెచ్చగొట్టింది. తల్లి చేసిన దారుణం గురించి బాలిక తండ్రికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..