West Bengal: తాను ఐపీఎస్ అధికారినని మభ్యపెట్టి యువతిని పెళ్లాడి.. ఆ తరువాత
ABN , Publish Date - May 25 , 2025 | 01:49 PM
తానో ఐపీఎస్ అని చెప్పుకుని యువతిని మెసగించి పెళ్లాడాడో వ్యక్తి. భార్యకు నిజం తెలిసేసరికి ఆమెను టార్చర్ పెట్టడం ప్రారంభించాడు. భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక యువతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: అతడు తాను ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పుకున్నాడు. యువతిని బురిడీ కొట్టించాడు. పెళ్లయ్యాక నిజం తెలిసిన యువతి భర్తను నిలదీస్తే టార్చర్ చేయడం ప్రారంభించాడు. ఈ చిత్ర హింసలను తట్టుకోలేకపోయిన యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన వెలుగు చూసింది.
బాధితురాలు షంపా కథనం ప్రకారం, ఆమెకు నిందితుడు హృదయ్ దేవ్ బిస్వాస్ ఎనిమిది నెలల క్రితం ఆన్లైన్లో పరిచయమయ్యాడు. తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకున్నాడు. ఆమెతో ప్రేమ వ్యవహారం మొదలెట్టాడు. చివరకు రెండు నెలల క్రితం రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నాడు.
పెళ్లయ్యాక షంపాకు భర్త నిజస్వరూపం తెలిసొచ్చింది. దీంతో, ఆమె అతడిని నిలదీసింది. నాటి నుంచీ షాంపాను భర్త వేధించడం ప్రారంభించాడు. చేయి చేసుకుంటూ, బెదిరిస్తూ నిత్య నరకం చూపించాడు. అతడి వేధింపులు రోజురోజుకు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయిన షాంపా చివరకు పోలీసులను ఆశ్రయించింది.
‘‘తానో ఐపీఎస్ ఆఫీసర్నని ఓసారి తెలిపాడు. మరోసారి సైబర్ క్రైమ్ పోలీసు అధికారి అని అన్నాడు. అంతా మోసం అని పెళ్లయ్యాక తెలిసింది’’ అని ఆమె పోలీసుల ముందు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని షాంపా తల్లి కూడా పోలీసులను అభ్యర్థించింది.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు దాఖలు చేసినట్టు తెలిపారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, త్వరలో కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్టు కూడా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
టీనేజర్ ఘాతుకం.. స్కూల్ ఫీజు అడిగితే ఇవ్వలేదని బామ్మను రాత్రి వేళ