మార్కెట్ క్రాష్
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:15 AM
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో...

సెన్సెక్స్ 823 పాయింట్లు పతనం
మళ్లీ 25,000 దిగువకి నిఫ్టీ
రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్ ఇందుకు ప్రధాన కారణం. ముడి చమురు ధరల పెరుగుదల, చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనలు, ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపు యోచనలో ఉన్నారన్న వార్తలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల కాలపరిమితి ముగింపు కూడా మార్కెట్పై ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలో మదుపరులు ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడటంతో సెన్సెక్స్ ఒక దశలో 992 పాయింట్ల వరకు క్షీణించింది. చివరికి సూచీ 823.16 పాయింట్ల (1 శాతం) నష్టంతో 81,691.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 253.20 పాయింట్లు (1.01 శాతం) కోల్పోయి 24,888.20 వద్దకు జారుకుంది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.98 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.449.58 లక్షల కోట్ల కు (5.26 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో 27 నష్టపోయాయి.
తాన్లా షేర్ల బైబ్యాక్: హైదరాబాద్కు చెందిన తాన్లా ప్లాట్ఫామ్స్ మరోసారి మార్కెట్ నుంచి సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేయనుంది. ఈ నెల 16న (సోమవారం) కంపెనీ బోర్డు సమావేశమై బైబ్యాక్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు బీఎ్సఈలో ఒకదశలో 12 శాతం ఎగబాకింది. చివరికి 9.18 శాతం వృద్ధితో రూ.679.35 వద్ద ముగిసింది. తాన్లా షేర్ల బైబ్యాక్ చేయటం గడిచిన ఐదేళ్లలో ఇది మూడోసారి. కంపెనీ 2020లో రూ.154 కోట్లు, 2022లో రూ.170 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News