మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63 కలెక్టర్
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:18 AM
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్.. భారత మార్కెట్లో మరిన్ని కస్టమైజ్డ్ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం ద్వారా ఈ ప్రత్యేక...

ధర రూ.4.30 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్.. భారత మార్కెట్లో మరిన్ని కస్టమైజ్డ్ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం ద్వారా ఈ ప్రత్యేక ఎడిషన్ కార్లను తీసుకురానున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ వెల్లడించారు. ఇందులో భాగంగానే గురువారం మెర్సిడెస్.. ఏఎంజీ జీ63 కలెక్టర్ పేరుతో ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసింది. దీని ధర రూ.4.30 కోట్లు (ఎక్స్షోరూమ్). ప్రత్యేక ఎడిషన్లో భాగంగా కేవలం 30 కార్లను మాత్రమే కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనుంది. కాగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని కస్టమైజ్డ్ మోడళ్లను, ప్రత్యేక ఫీచర్లతో తీసుకురానున్నట్లు అయ్యర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News