Share News

From July 1st Financial Changes: ఆధార్ నుంచి ఏటీఎం ఛార్జీల వరకూ.. జూలై 1 నుంచి రానున్న మార్పులివే..

ABN , Publish Date - Jun 30 , 2025 | 09:56 PM

జూలై 1 నుంచి దేశంలో వ్యక్తిగత పన్ను చెల్లింపులు సహా ఆర్థిక వ్యవహారాల విషయంలో (From July 1st Financial Changes) కీలక మార్పులు రానున్నాయి. అయితే ఈసారి ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

From July 1st Financial Changes: ఆధార్ నుంచి ఏటీఎం ఛార్జీల వరకూ.. జూలై 1 నుంచి రానున్న మార్పులివే..
From July 1st Financial Changes

జూలై 1 నుంచి భారతదేశంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారుల జీవితాలను ప్రభావితం చేసే అనేక కొత్త నిబంధనలు (From July 1st Financial Changes) అమలులోకి రానున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు, క్రెడిట్ కార్డ్, తత్కాల్ రైలు టికెట్ బుకింగ్‌, కొత్త పాన్ కార్డ్ దరఖాస్తుకు ఆధార్ తప్పనిసరి చేయడం వంటి అనేక మార్పులు రానున్నాయి. ఈ మార్పులు HDFC, SBI, ICICI వంటి బ్యాంకుల ఖాతాదారులపై కూడా ప్రభావం చూపించనున్నాయి.


ఆధార్ తప్పనిసరి

జూలై 1 నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొత్త పాన్ కార్డ్ దరఖాస్తులకు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులతో పాన్ కార్డ్ దరఖాస్తు చేయడం సాధ్యమవుతోంది. కానీ ఇకపై ఆధార్ లేకుండా కొత్త పాన్ కార్డ్ పొందడం కుదరదు. ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారు డిసెంబర్ 31, 2025 లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. ఈ నిబంధనను పాటించని వారి పాన్ కార్డ్‌లు డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం మర్చిపోవద్దు.


రైలు టికెట్ బుకింగ్‌లో మార్పులు

తత్కాల్ రైలు టికెట్ బుకింగ్‌లకు కూడా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ఈ నిబంధన జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. అంతేకాదు జూలై 15 నుంచి, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్‌లకు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) అవసరం. ఈ ప్రక్రియలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. అదనంగా, రైల్వే శాఖ టికెట్ ధరలలో స్వల్ప పెంపును అమలు చేయనుంది. నాన్ ఏసి కోచ్‌లకు కిలోమీటర్‌కు 1 పైసా, ఏసి కోచ్‌లకు కిలోమీటర్‌కు 2 పైసలు ధరలు పెరగవచ్చు. ఈ మార్పులు ప్రయాణికుల బడ్జెట్‌పై కొంత ప్రభావం చూపించనున్నాయి. కాబట్టి ప్రయాణ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.


ఐటీఆర్ గడువు పొడిగింపు

CBDT ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఈ 46 రోజుల అదనపు సమయం ఉద్యోగులకు తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి సౌలభ్యాన్ని కల్పిస్తుంది. అయితే, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నవారు పాత గడువైన జూలై 31 లోపు రిటర్న్‌లను దాఖలు చేయడం మంచిది. ఎందుకంటే, గడువు దగ్గరపడే కొద్దీ వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్యలు లేదా గ్లిచ్‌లు తలెత్తే అవకాశం ఉంది. ముందుగానే రిటర్న్ ఫైల్ చేస్తే, ఈ ఇబ్బందులను నివారించవచ్చు.


SBI క్రెడిట్ కార్డ్ మార్పులు

SBI తన ప్రీమియం కార్డులైన SBI ఎలైట్, మైల్స్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ వంటి కార్డులతో ప్లైట్ టికెట్ కొనుగోలు చేసినప్పుడు అందించే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను నిలిపివేస్తోంది. అలాగే, నెలలవారీ బిల్లుల కోసం కనీస చెల్లింపు మొత్తం (Minimum Amount Due MAD) లెక్కింపు విధానంలో కూడా మార్పులు చేయనుంది. ఈ మార్పులు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారి ఆర్థిక ప్లానింగ్‌పై ప్రభావం చూపించనున్నాయి.


HDFC క్రెడిట్ కార్డ్ ఛార్జీలు

  • HDFC బ్యాంక్ కొన్ని లావాదేవీలపై ఛార్జీలను సవరించనుంది. ఈ కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.

  • అద్దె చెల్లింపులు: మీరు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే, లావాదేవీకి 1% ఫీజు విధించబడుతుంది (గరిష్టంగా రూ. 4,999)

  • ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్‌లు: రూ. 10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, 1% ఫీజు (గరిష్టంగా రూ. 4,999) వర్తిస్తుంది

  • యుటిలిటీ బిల్లులు: నెలకు రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు విధించబడుతుంది (ఇన్సూరెన్స్ లావాదేవీలకు మినహాయింపు).

  • డిజిటల్ వాలెట్ లోడింగ్: ఒకే లావాదేవీలో రూ. 10,000 కంటే ఎక్కువ డిజిటల్ వాలెట్‌లో లోడ్ చేస్తే, 1% ఫీజు (గరిష్టంగా రూ. 4,999) వర్తిస్తుంది.


ICICI క్రెడిట్ కార్డ్ ఛార్జీలు

  • ICICI బ్యాంక్ కూడా సర్వీస్ ఛార్జీలను సవరించనుంది. ఈ మార్పులు ATM లావాదేవీలు, ఆన్‌లైన్ బదిలీలను ప్రభావితం చేస్తాయి.

  • ICICI బ్యాంక్ ATM లావాదేవీలు: మొదటి ఐదు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత, నగదు ఉపసంహరణకు లావాదేవీకి రూ. 23 ఛార్జ్ విధించబడుతుంది. నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయి.

  • నాన్-ICICI బ్యాంక్ ATMలు: మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలు, చిన్న పట్టణాల్లో ఐదు ఉచిత లావాదేవీలు అనుమతించబడతాయి. ఆ తర్వాత, నగదు ఉపసంహరణకు రూ. 23 ఛార్జ్ విధించబడుతుంది.

  • అంతర్జాతీయ ATM లావాదేవీలు: నగదు ఉపసంహరణకు రూ. 125, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ. 25, 3.5% కరెన్సీ కన్వర్షన్ ఫీజు వర్తిస్తుంది.

  • IMPS బదిలీలు: ఆన్‌లైన్ బదిలీల ఛార్జీలు రూ. 2.5 నుంచి రూ. 15 వరకు సవరించబడ్డాయి.

  • CRM లావాదేవీలు: నెలకు మూడు ఉచిత నగదు లావాదేవీలు అనుమతించబడతాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 150 ఛార్జ్ విధించబడుతుంది.

  • నగదు డిపాజిట్‌లు: నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్‌లపై రూ. 150 లేదా రూ. 1,000కు రూ. 3.50 ఛార్జ్ విధించబడుతుంది. థర్డ్-పార్టీ డిపాజిట్‌లకు లావాదేవీకి రూ. 25,000 పరిమితి ఉంటుంది.


ఇవీ చదవండి:

కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 10:00 PM