Share News

Rs 500 Currency Notes: 500 నోట్లు కూడా రద్దేనా..? ఆర్బీఐ ఏం చెబుతోందంటే..

ABN , Publish Date - Jun 07 , 2025 | 10:34 AM

Rs 500 Currency Notes: 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని ‘క్యాపిటల్ టీవీ ఇండియా’ అనే యూట్యూబ్ ఛానల్ పేర్కొంది. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Rs 500 Currency Notes: 500 నోట్లు కూడా రద్దేనా..? ఆర్బీఐ ఏం చెబుతోందంటే..
Rs 500 Currency Notes

2 వేల రూపాయల నోట్లలాగే.. 500 రూపాయల నోట్లు కూడా కనిపించకుండా పోతాయని దేశ వ్యాప్తంగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. 2026 నాటికి మొత్తం 500 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కాపిటల్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానల్ దీనిపై వీడియో సైతం చేసింది. 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని పేర్కొంది. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.


యూట్యూబ్‌లో 5 లక్షలకుపైగా మంది ఆ వీడియోను చూశారు. ఇక, 500 నోట్ల ఉపసంహరణపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ స్పందించింది. ‘ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయి’ అని ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 3వ తేదీన అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘2026 నాటికి 500 రూపాయల నోట్లు చలామణీలో లేకుండా పోతాయా?..


యూట్యూబ్‌లో ‘క్యాపిటల్ టీవీ’ అనే ఛానల్ తప్పుడు ప్రచారం చేసింది. 2026 మార్చి నాటికి ఆర్బీఐ 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటోందని పేర్కొంది. అందులో నిజం ఏంటంటే.. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయి. అలాంటి తప్పుడు వార్తల బారిన పడొద్దు. ఏదైనా వార్తను నమ్మలన్నా.. దాన్ని వేరే వాళ్లకు షేర్ చేయాలన్నా.. ముందు దాన్ని అధికారిక సోర్సులనుంచి ధ్రువీకరించుకోండి’ అని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

జంతు ప్రపంచంలో బెస్ట్ నాన్నలు ఇవే

పుణ్య స్నానం చేద్దామనుకుంటే ప్రాణాల మీద కొచ్చింది..

Updated Date - Jun 07 , 2025 | 10:34 AM