Amazon: అమెజాన్ వినూత్న ప్రయోగం.. ఇకపై రోబోలతో డోర్ డెలివరీ
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:29 PM
Amazon Company: డెలివరీ ఏజెంట్లతో పాటు రోబోలు కూడా డెలివరీకి వెళ్లనున్నాయి. ఓ అడ్రస్లో డెలివరీ ఏజెంట్ పార్సిల్ డెలివరీ చేస్తే.. మరో చోట రోబోలు పార్సిల్లను డెలివరీ చేయనున్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. డెలివరీ బాయ్స్ స్థానంలో హ్యూమనాయిడ్ రోబోలను పనిలో పెట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్, టెస్టింగ్ నడుస్తోంది. హ్యూమనాయిడ్ పార్క్ పేరుతో ఇప్పటికే కొన్ని రోబోలను తయారు చేసింది. వాటిని శాన్ప్రాన్సిస్కోలోని ఆఫీస్లో పరీక్ష చేస్తోంది. ఓ టీ షాపు సైజు ఉండే ప్రదేశంలో వాటిపై ప్రయోగాలు జరుపుతోంది. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే.. రోబోలు ఫీల్డ్లోకి దిగనున్నాయి.
డెలివరీ వ్యాన్లలో ప్రయాణం చేసి.. ఇంటింటికి తిరిగి డెలివరీ ఇవ్వనున్నాయి. డెలివరీ ఏజెంట్లతో పాటు డెలివరీకి వెళ్లనున్నాయి. ఓ అడ్రస్లో డెలివరీ ఏజెంట్ పార్సిల్ డెలివరీ చేస్తే.. మరో చోట రోబోలు పార్సిల్లను డెలివరీ చేయనున్నాయి. ఇలా చేయటం ద్వారా డెలివరీ స్పీడ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఇక, ఈ రోబోల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్వేర్ను అమెజాన్ డెవలప్ చేస్తోంది. మరికొన్ని నెలల్లో రోబోలు మనుషుల్లా పార్సిల్స్ డెలివరీ చేయడానికి సిద్ధమవనున్నాయి.
ఆర్డర్లపై అదనపు ఛార్జీలు
కస్టమర్లకు షాక్ ఇచ్చేలా అమెజాన్ కొత్త రూలును అమల్లోకి తెచ్చింది. ఇకపై కస్టమర్ల ఆర్డర్లపై మార్కెట్ ప్లేస్ ఫీజు కింద 5 రూపాయల చొప్పున వసూలు చేయనుంది. అమెజాన్ సైట్ ద్వారా వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకునే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు కూడా ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో బాటలోనే అమెజాన్ కూడా నడుస్తోంది. అమెజాన్ మెయిన్ కాంపిటీటర్ అయిన ఫ్లిప్కార్ట్ కూడా గత సంవత్సరం నుంచి మార్కెట్ ప్లేస్ ఫీజు కింద 3 రూపాయల ఛార్జీలను కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
నీట్ పీజీ పరీక్ష వాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ