జనని బ్యాంకు కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:24 PM
జనని సహకార సంఘం బ్యాంకు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్ తెలిపారు.

కోవెలకుంట్ల, జూన 6 (ఆంధ్రజ్యోతి) : జనని సహకార సంఘం బ్యాంకు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్ తెలిపారు. శుక్రవారం కోవెలకుంట్ల పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జనని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ పొదుపు, పరపతి సొసైటీ లిమిటెడ్ బ్యాంకును అక్టోబరు 2021లో కో ఆపరేటివ్ రిజిస్టరు ఆఫీసు కర్నూలులో రిజిస్టరు చేయించి ఇందులో కీలక పాత్ర పోషించిన కడప జిల్లా సీకేదిన్నె మండలం సోమవాండ్లపల్లెకు చెందిన ఆకుల వెంకటరమణ, కోవెలకుంట్ల టౌన గడ్డమీదికి చెందిన గువ్వల పద్మావతి ఉన్నారు. వీరు మరికొంత మందితో కలిసి ఒక పథకం ప్రకారం కోవెలకుంట్ల చుట్టుపక్కల ప్రజలతో డబ్బులు కట్టించి ఎక్కువ వడ్డీలు ఇస్తామని ఆశ చూపి కొంత మందికి లోన్లు ఇచ్చి ప్రజల నుండి స్వీకరించిన డబ్బులు దుర్వినియోగం చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ మేరకు జనని బ్యాంకులో వేసిన డబ్బులను సీఈవో వెంకట్రమణ లింకు ఇప్పించి డబ్బులను వేర్వేరు అకౌంట్లలోకి బదిలీ చేసి వచ్చిన నగదు కూడా వారి సొంతానికి వాడుకున్నారు. రెండు, మూడు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లో సేవింగ్స్ చేసుకున్న వారికి గడువు అయిపోయినా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని బాధితులు బుధవారం పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయగా ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులు మోసపోయినట్లు తెలిపారు. మొత్తం రూ.13.45 లక్షలు మోసపోయినట్లు తెలిపారు. జనని బ్యాంకులో గడువు తీరినా డబ్బులు పొందని వారు ఇంకా ఉంటే వారు ఉంటే తమను సంప్రదించాలని సీఐ తెలిపారు. సొసైటీ సీఈవో రమణ, పద్మావతి తదితరులపై కేసు నమోదు చేశామని, మిగతా వారిని త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.