లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు: టీటీడీ
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:21 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. లడ్డూ ప్రసాదంపై తెలంగాణకు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలు అసత్యమని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

తిరుమల, జూన్ 13(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. లడ్డూ ప్రసాదంపై తెలంగాణకు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలు అసత్యమని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. ‘జూన్ 8న శ్రీవారి లడ్డూప్రసాదం తినేటప్పుడు నోట్లో గాయమైందని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్కుమార్ ఆరోపించారు. వైద్య పరీక్షల్లో నాలుక కొరుక్కోవడంతో గాయమైనట్టు తేలింది. టీటీడీ నుంచి నష్టపరిహారం పొందాలనే దురుద్దేశంతో లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో అతను చేసిన అసత్య ఆరోపణల్ని ఖండిస్తున్నాం’ అని టీటీడీ పేర్కొంది.