కేజీబీవీ టీచర్లకు శిక్షణ ప్రారంభం
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:46 PM
రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి కేజీబీవీలలో పని చేస్తున్న 120 మంది ఇంగ్లీష్ పీజీటీలకు ఆదివారం శిక్షణ ప్రాంభమైంది.

కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి కేజీబీవీలలో పని చేస్తున్న 120 మంది ఇంగ్లీష్ పీజీటీలకు ఆదివారం శిక్షణ ప్రాంభమైంది. కర్నూలు నగర శివారు పరిధిలోని రాఘవేంద్ర బీఈడీ కళాశాలలో ఈ నెల 7వ తేదీ వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అదనపు పతక సంచాలకుడు డా.ప్రసన్నకుమార్ బోధనకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులకు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు డీఈవో శామ్యూల్ పాల్, కర్నూలు, నంద్యాల జిల్లాల జీసీడీవోలు స్నేహలత, సువర్చల, ఆరుగురు రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.