నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం రాక
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:25 PM
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహయాదవ్ తెలిపారు.

పిన్నాపురంలో ప్రాజెక్టుల పరిశీలన
నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్
కర్నూలు, అర్బన, జూన 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహయాదవ్ తెలిపారు. శుక్రవారం కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం 6గంటలకు బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదే రి కర్నూలు నగర శివారులోని టోల్ప్లాజాకు 8.30కు చేరుకుంటారన్నారు. ఉమ్మడి జిల్లాల కాంగ్రె స్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారని తెలిపారు. అక్కడి నుంచి పాణ్యం నియోజవర్గం పరిధిలోని పిన్నాపురంలో నిర్మాణ దశలో ఉన్న ఇరిగేటెడ్ రెనెవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్ఈపీ) పనుల తీరును మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజుతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపై చర్చించనున్నారు. తిరుగు ప్రయాణం కర్నూలు మీదుగా హైదరాబాద్కు బయలుదేరుతారని తెలిపారు. సమావేశంలో నగర అధ్యక్షుడు జిలానీబాషా, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.